Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ నోటి నుంచి చికెన్ ముక్క లాగేసిన అనుష్క శర్మ.. ఎందుకు?

టీమిండియా కెప్టెన్, పరుగుల సునామీ విరాట్ కోహ్లీ మాంసాహారం ముట్టట్లేదట. పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. ముక్కలేనిదే ముద్ద తినని కోహ్లీ.. తన శ్రీమతి అనుష్క శర్మ కోసం వందశాతం వెజిటేరియన్‌గా మారిపోయాడట. అ

Advertiesment
Virat Kohli
, మంగళవారం, 9 అక్టోబరు 2018 (15:34 IST)
టీమిండియా కెప్టెన్, పరుగుల సునామీ విరాట్ కోహ్లీ మాంసాహారం ముట్టట్లేదట. పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. ముక్కలేనిదే ముద్ద తినని కోహ్లీ.. తన శ్రీమతి అనుష్క శర్మ కోసం వందశాతం వెజిటేరియన్‌గా మారిపోయాడట. అనుష్క కోసం విరాట్ మాంసాహారాన్ని పక్కనబెట్టి నాలుగు నెలలు గడిచిపోయాయట.


ఒకప్పుడు దమ్ బిర్యానీ ఇష్టంగా లాగించే విరాట్... ఇప్పుడు ప్రోటీన్ షేక్స్, ఆకుకూరలు, సోయా మాత్రమే తీసుకుంటున్నాడట. కొన్నాళ్ల నుంచి గుడ్లు, పాల ఉత్పత్తులు కూడా తినడం కోహ్లీ మానేశాడని వార్తలు వస్తున్నాయి. 
 
ఇదంతా ఫిట్‌నెస్ కోసమేనని.. మాంసాహారం మానేసిన తర్వాత కోహ్లీ ఫిట్‌నెస్ మరింత మెరుగయ్యిందని చెప్తున్నాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో విరాట్ ఆటతీరు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఫోర్లలతో బౌలర్లతో విరుచుకుపడే విరాట్ కోహ్లీ తన సెంచరీలో కొట్టింది కేవలం 10 ఫోర్లు మాత్రమేనని క్రీడా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కోహ్లీ అనుష్క కోసం పూర్తిగా శాకాహారానికి మారిపోయాడని తెలుస్తోంది. 
 
కోహ్లీ శాకాహారిగా మారిన ఫలితమో ఏమో కానీ ఇటీవల విరాట్ మూడేళ్లలో టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. తాజా విండీస్‌తో టెస్టులో సెంచరీతో అదరగొట్టాడు. సాధారణంగా కోహ్లీకి గ్రిల్డ్ చికెన్, మ్యాష్డ్ పొటాటోస్, స్పినాష్, డిన్నర్లో సీ ఫుడ్స్ తీసుకునేవాడు. కానీ ప్రస్తుతం కోహ్లీ సీన్ అంతా అనుష్క శర్మ మార్చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దినేష్ కార్తీక్- దీపికా పల్లికాల్ న్యూయార్క్ ట్రిప్.. వైరల్ అవుతున్న ఫోటోలు