Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్న ఈయూ

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (15:33 IST)
పాకిస్థాన్‌లో తలదాచుకొని భారతదేశంపై ఉగ్రదాడులు చేస్తున్న జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానానికి మోకాలడ్డుతున్న చైనాకు చెంపపెట్టులాంటి నిర్ణయం ఒకటి తెర మీదకు వచ్చింది. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) సిద్ధమవుతోంది. 
 
మసూద్‌పై చర్యకు భద్రతా మండలిలో అన్ని దేశాలు అంగీకరిస్తున్నప్పటికీ వీటో అధికారం ఉన్న చైనా పదేపదే మోకాలడ్డుతూండడంతో అతన్ని తమకు తాముగా ఉగ్రవాది జాబితాలో చేర్చాలని యూరోపియన్‌ యూనియన్‌ నిర్ణయించింది. గతవారం ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానాన్ని ప్రస్తావించిన ఫ్రాన్స్‌ ఇప్పటికే తమ దేశంలో జైషే చీఫ్‌ను నిషేధించి... తమ దేశంలోని అతని ఆస్తులను స్తంభింపజేసింది.
 
ఈ దిశగా మిగిలిన దేశాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు ఎమాన్యుయేల్‌ మాక్రాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. యూనియన్‌లోని 28 సభ్య దేశాలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించింది. 2009, 2016 సంవత్సరాలతోపాటు ఇటీవలి యూఎన్‌ భద్రతా మండలిలో మసూద్ అజర్‌పై తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. ఇది జరిగిన కొద్దిరోజులకే యూరోపియన్‌ యూనియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇది అమల్లోకి వస్తే చైనా తీరుకు చెంపపెట్టే అనవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments