Webdunia - Bharat's app for daily news and videos

Install App

జులై 12 నుంచి జపాన్‌లో ఎమర్జెన్సీ

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:41 IST)
జులై 12 నుంచి  జపాన్‌లో మళ్లీ ఎమర్జెన్సీని విధించారు. కరోనా నేపథ్యంలో.. ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే. మూడో ఎమర్జెన్సీ జులై 11 తో ముగియనుండగా, జులై 12 నుంచి 22 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

దేశ రాజధాని టోక్యోతో సహా ప్రధాన నరగాల్లో డెల్టా వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. మిగతా వేరియంట్ల కంటే డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తుండటంతోపాటు, తీవ్రత కూడా అధికంగా ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు జపాన్‌ ప్రధాని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ సమయంలో రోడ్లపైకి ప్రజలు గుంపులుగా వచ్చేందుకు అవకాశం ఉండదు. పార్టీలకు, సమావేశాలకు అనుమతులు ఉండవు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండాలి. అనవసరంగా రోడ్లమీదకు వస్తే కేసులు నమోదుచేసి జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.

మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కాబోతున్నాయి. ఒలింపిక్స్‌కు 50 శాతం మంది ప్రజలకు మాత్రమే అనుమతి ఇస్తామని మొదట చెప్పినా, ప్రస్తుత పరిస్థితుల దఅష్ట్యా, ప్రేక్షకులు లేకుండానే విశ్వక్రీడలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు జపాన్‌ ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments