Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈక్వెడార్‌ జైల్లో శవాల కుప్పలు - ఎమర్జెన్సీని విధింపు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:46 IST)
ఈక్వెడార్‌ దేశంలోని గాయక్విల్‌ నగరంలోని లిటోరల్‌ జైల్లో ఘర్షణ చెలరేగింది. అయితే, ఈ ఘర్షణ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 116కు పెరిగింది. దీంతో పరిస్థితి చేయిదాటిపోవడంతో అక్కడ జైళ్ళలో అత్యయికస్థితిని విధించింది. 
 
కాగా, లిటోరల్ జైల్లో రెండు ముఠాల సభ్యులు కారాగారంలో తుపాకులు, కత్తులు, బాంబులతో మంగళవారం పరస్పరం దాడులు చేసుకొని బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో మరో 80 మందికి గాయాలయ్యాయి. ఈక్వెడార్‌ చరిత్రలో జైళ్లలో చోటుచేసుకున్న అతిపెద్ద మారణహోమం ఇదేకావడం గమనార్హం. 
 
తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈక్వెడార్‌ వ్యాప్తంగా జైళ్లలో అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు గిలెర్మో లసో ప్రకటించారు. వాటిలో అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు. 
 
ఏరులై పారిన రక్తం, తెగిపడిన శరీర భాగాలు, పేలుళ్ల విధ్వంసంతో లిటోరల్‌ జైల్లో పరిస్థితులు భయానకంగా కనిపించాయి. ఒక్కోచోట మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. మృతుల్లో ఐదుగురి తలలు మొండేల నుంచి వేరయ్యాయి. తరచూ ఘర్షణలు తలెత్తుతుండటంతో ఈ ఏడాది జులైలో కూడా ఈక్వెడార్‌ కారాగారాల్లో ఎమర్జెన్సీని విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments