Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోంటానాలో పట్టాలు తప్పిన రైలు - ముగ్గురి మృతి

మోంటానాలో పట్టాలు తప్పిన రైలు - ముగ్గురి మృతి
, ఆదివారం, 26 సెప్టెంబరు 2021 (11:10 IST)
అమెరికా దేశంలోని మోంటానాలో పెను ప్రమాదం తప్పింది. మోంటానాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.  
 
ఈ రైలు శనివారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) సియాటెల్‌ నుంచి చికాగో బయలుదేరగా, జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు,13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మరో 28 వేల కరోనా పాజటివ్ కేసులు