ఆస్తి కోసం కన్నతండ్రిని హత్య చేసిన తనయులు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:40 IST)
ఆస్తిని సమానంగా పంచలేదన్న అక్కసుతో కన్నతండ్రిని కన్నకుమారులు కాటికి పంపారు. ఆస్తి కోసం దారుణంగా హత్య చేశారు. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అందోలు మండలం బ్రాహ్మణపల్లిలో బుధవారం అర్థరాత్రి జరిగింది. 
 
జోగిపేట ఎస్ఐ వెంకటేశం వెల్లడించిన వివరాల మేరకు... బ్రాహ్మణపల్లికి చెందిన పెద్దగొల్ల పాపయ్య(60) అనే వ్యక్తికి విఠల్‌, నరేశ్‌, కృష్ణ, చిరంజీవి అనే కుమారులు ఉన్నారు. కృష్ణ వట్పల్లిలో ఉంటుండగా మిగతా ముగ్గురూ గ్రామంలోనే విడిగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. 
 
భార్య నాలుగేళ్ల క్రితమే మృతిచెందగా పాపయ్య పెద్ద కుమారుడు విఠల్‌ వద్ద ఉంటున్నాడు. తండ్రి పేరిట ఉన్న 9 ఎకరాల పొలం పంపకాల విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పెద్దకుమారుడు విఠల్‌కు మిగతా వారికంటే కొంత భూమి ఎక్కువ ఇస్తాననని పాపయ్య చెప్పాడు. దీనికి నరేష్‌, కృష్ణ అభ్యంతరం చెప్పారు. 
 
ఈ క్రమంలో బుధవారం రాత్రి నరేష్‌, కృష్ణ బ్రాహ్మణపల్లికి చేరుకున్నారు. ఇంట్లోని మొదటి అంతస్తులో నిద్రిస్తున్న తండ్రి పాపయ్య వద్దకు వెళ్లి ఇటుకతో తలపై బలంగా మోదారు. కింది గదిలో పడుకున్న విఠల్‌ అరుపులు విని పైకి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో తండ్రి మృతదేహం కనిపించింది. నిందితులు ఇద్దరూ పరారయ్యారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments