Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా శాస్త్రవేత్తలకు వైద్యరంగంలో నోబెల్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (20:28 IST)
ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తుల ప్ర‌క‌ట‌న ప్ర‌క్రియ సోమ‌వారం ప్రారంభ‌మైంది. తొలి రోజు వైద్య విభాగంలో అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జులియ‌స్‌, ఆర్డెమ్ పాటాపౌటియ‌న్‌లకు నోబెల్ అవార్డులు వరించాయి. విజేత‌ల‌ను నోబెల్ క‌మిటీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ థామ‌స్ పెర్ల్‌మాన్ ప్ర‌క‌టించారు. 
 
ఉష్ణోగ్ర‌త‌, స్ప‌ర్శ‌కు సంబంధించి గ్రాహ‌కాల‌ను క‌నుగొన్నందుకుగాను వీళ్ల‌ను నోబెల్ వ‌రించింది. మ‌న చుట్టూ ఉన్న ప్ర‌పంచంతో మ‌నం ఎలా ఉంటున్నామ‌న్న‌దానితోపాటు మ‌న మ‌నుగ‌డకు ఉష్ణం, చ‌ల్ల‌ద‌నం, స్ప‌ర్శ‌ను గుర్తించే మ‌న సామ‌ర్థ్యం కీల‌కం. 
 
మ‌న నిత్య జీవితంలో వీటిని మ‌నం తేలిగ్గా తీసుకుంటాం. కానీ ఉష్ణోగ్ర‌త‌, పీడ‌నాన్ని గ్ర‌హించ‌డానికి మ‌న న‌రాల ప్రేర‌ణ‌లు ఎలా ఉంటాయి? ఈ ప్ర‌శ్న‌కు ప‌రిష్కారాన్ని ఈ ఏడాది నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత‌లు చూపించారు అని నోబెల్ జ్యూరీ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.
 
కాగా, జులియ‌స్ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూనివ‌ర్సిటీ ఆప్ కాలిఫోర్నియా ప్రొఫెస‌ర్ కాగా.. ఆర్డెమ్ కాలిఫోర్నియాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ప్రొఫెస‌ర్‌గా ఉన్నారు. ఇప్పుడీ ఇద్ద‌రికీ నోబెల్ బ‌హుమ‌తితో వ‌చ్చే 11 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను స‌మానంగా పంచుతారు. గ‌తేడాది మెడిసిన్‌లో నోబెల్ ముగ్గురిని వ‌రించిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments