Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం

Advertiesment
ex mp
విజయవాడ , శనివారం, 2 అక్టోబరు 2021 (10:05 IST)
దేశంలోనూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనూ సామాజిక న్యాయం క‌న‌ప‌డటం లేద‌ని, అది కేవ‌లం కాంగ్రెస్ పార్టీ హ‌యాంలోనే జ‌రిగేద‌ని మాజీ ఎంపీ చింతా మోహ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక న్యాయం అందించే దిశ‌గా 2024లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం అన్నారు. కృష్ణా జిల్లాల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు 85% శాతం ఉన్నారని  తెలిపారు. దళితులకు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఏర్పాటు అవసరమ‌ని, జాతీయ స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ ను గ‌తంలో ప్ర‌ధాని ఇందిరా గాంధీ  ఏర్పాటు  చేశార‌ని చెప్పారు.
 
కేంద్రంలో ఎస్సీ, ఎస్.టి., ఓబీసీలకు హక్కులున్నాయ‌ని, అందువ‌ల్లే, ప్ర‌తిభావంతులైన విద్యార్థులు  కృష్ణా జిల్లా నుంచి ఎక్కువ మంది ఐఏఎస్, ఐపీఎస్.లు అయ్యార‌ని చింతామోహ‌న్ చెప్పారు. రాష్ట్రంలో  ఇంత వరకు 80 లక్షల మంది విద్యార్థుల‌కు స్కాలర్ షిప్ ఇవ్వలేకపోయార‌ని, జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ రాష్ట్రంలో దీపావళి నుంచి అయినా స్కాలర్  షిప్పులు మంజూరుచేయాల‌ని డిమాండు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తూ.గో: పవన్ కళ్యాణ్ పర్యటన: శ్రమదానంపై ఉత్కంఠ