Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా లాక్ డౌన్ బెలారస్‍‌లో లేదు.. 2919 కేసులు.. 29మంది మృతి

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (21:13 IST)
ప్రపంచ దేశాలన్నీ కరోనా కోసం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో బెలారస్ మాత్రం అందుకు విరుద్ధం. ఈ దేశంలో కనీసం లాక్‌డౌన్‌ను కూడా పూర్తి అమలు చేయడం లేదు. అంతేగాక ఇక్కడ విచ్చలవిడిగా అన్నీ క్రీడలు కొనసాగుతూనే వున్నాయి. వీటిని వీక్షించేందుకు భారీ ఎత్తున అభిమానులు వెల్లువెత్తుతున్నారు. ఇప్పటివరకు బెలారస్‌లో 2919 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బెలారస్‌లో ఆటలను బహిష్కరించాలనే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆదివారం బెలారసియన్ టాప్-ఫ్లైట్ లీగ్ మ్యాచ్‌కు దాదాపు వెయ్యి మంది అభిమానులు హాజరయ్యారు. ఒకరినొకరు ఉత్సాహపరచుకుంటూ.. నినాదాలు చేశారు. 
 
ఈ ఆటకు చాలామంది దూరంగా ఉన్నప్పటికీ వెయ్యి మందికిపైగా హాజరయ్యారు. వీరిలో అతి కొద్దిమంది మాత్రమే ముఖానికి మాస్కులు ధరించి కనిపించారు. కాగా కరోనాను అదుపు చేయడానికి కఠిన చర్యలను తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ బెలారస్‌ అధికారులను కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments