భారత్ పైన దాడికి సపోర్ట్ కావాలి ప్లీజ్... డ్రాగన్‌కి ఫోన్ చేసిన పాక్...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (14:47 IST)
భారత్ వైమానిక దాడులతో పాకిస్థాన్‌కి కునుకు లేకుండా చేసినట్లుంది. ఇవాళ ఉదయం జరిగిన యుద్ధ విమానాల దాడులతో పాక్ వణికిపోయింది. అలెర్ట్ అయిన పాకిస్థాన్ తనకు అత్యంత సన్నిహిత స్నేహబంధాన్ని కలిగి ఉన్న డ్రాగన్ దేశానికి ఫోన్ చేసి సాయం అందించవలసిందిగా కోరింది. భారత వాయుసేన విమానాలు దాడి చేసి వెనక్కి వెళ్లిన వెంటనే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ వీకి ఫోన్ చేసారు. 
 
ఇదే విషయాన్ని చైనా ప్రభుత్వరంగ అధికారిక వార్తా సంస్థ క్సిన్హువా స్వయంగా వెల్లడించడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా భారత సైన్యం వాస్తవాధీన రేఖను దాటి ముజఫరాబాద్ సెక్టార్‌లోకి ప్రవేశించిందని ఖురేషి చైనాకు ఫిర్యాదు చేసారు. భారత్‌పై తిరిగి దాడులు చేసేందుకు సహకరించాలని కోరితే, చైనా అందుకు అంగీకరించలేదని సమాచారం. 
 
భారత యుద్ధ విమానాలను పసిగట్టిన పాక్ ఎయిర్‌ఫోర్స్ కౌంటర్ ఫైటర్ దళాలు వాటికి దీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆ దేశ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ఉదయాన్నే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. భారత్ చేస్తున్న దాడులతో మొత్తమ్మీద పాకిస్థాన్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments