Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్జికల్ స్ట్రైక్స్ ఓవర్.. వాట్ నెక్స్ట్ .. ప్రధాని హైలెవల్ మీటింగ్

సర్జికల్ స్ట్రైక్స్ ఓవర్.. వాట్ నెక్స్ట్ .. ప్రధాని హైలెవల్ మీటింగ్
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (11:03 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న జైషే ఈ మొహమ్మద్ తీవ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో మెరుపుదాడులు నిర్వహించాయి. ముజఫరాబాద్ సెక్టార్‌లో జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్స్‌లో జైష్ మొహమ్మద్‌కు చెందిన ఆల్ఫా-3 కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే, 300 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ మెరుపు దాడులను పాకిస్థాన్ ధృవీకరించింది. భారత్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. 
 
ఇదిలావుంటే, ఈ మెరుపుదాడులను భారత వైమానికదళం విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. తాజా సమాచారం మేరకు... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్‌ను తన సహచరులకు ప్రధాని మోడీ వివరించినట్టు తెలుస్తోంది. 
 
వాయుసేన సాధించిన విజయంతో పాటు.. ఇండో-పాక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. ఇకపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. ఈ సమావేశానికి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌లతో పాటు జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత అధికారులు హాజరయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#Surgicalstrike2 : జైష్ కంట్రోల్ రూమ్ ఆల్ఫా-3 నేలమట్టం (Video)