Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటల్లో చిక్కుకున్న బల్గేరియా బస్సు-45మంది సజీవదహనం

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (15:56 IST)
బల్గేరియాలో ఓ లగ్జరీ బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో 45మంది సజీవదహనం అయ్యారు. చనిపోయిన వారిలో 12 మంది చిన్నారులు ఉండడం అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి టూరిస్టులతో వెళుతుండగా ఈ బస్సు మంటల్లో చిక్కుకుంది. 
 
ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దివ్యవధిలోనే బస్సు కాలిపోయింది.  ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలు ఏమాత్రం గుర్తించలేని విధంగా బూడిదగా మారాయి. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాసిడోనియా రాయబార కార్యాలయం ప్రతినిధులు బాధితులను తీసుకెళ్లిన ఆసుపత్రిని సందర్శించారని బల్గేరియన్ వార్తా సంస్థ నోవినిట్ తెలిపింది. ప్రమాదానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments