పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌‌కు బ్రిటన్‌‌ షాక్.. దేశం వదిలిపోవాల్సిందే

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (19:22 IST)
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ బ్రిటన్‌ను వదిలిపోవాల్సిందేనని ఆ దేశం తేల్చేసింది. వీసా గడువు పొడగింపు కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా.. దేశం విచిడి వెళ్లాల్సిందే అని స్పష్టం చేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ (71)పై పాకిస్థాన్‌లో రెండు అవినీతి కేసులను ఎదుర్కొంటున్నారు. అల్ అజీజియా మిల్స్ కేసులో ఆయనకు కోర్టు 2018లో ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. 
 
ఈ క్రమంలో ఆయన కొద్ది రోజులు లాహోర్ జైలులో జైలు జీవితం గడిపారు. తర్వాత వైద్య చికిత్స కోసం బెయిల్ కావాలంటూ.. నవాజ్ షరీఫ్ కోర్టు ఆశ్రయించారు. దీంతో లాహోర్ కోర్టు ఆయనకు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది.
 
బెయిల్ రావడంతో చికిత్స కోసం 2019లో ఇంగ్లాండ్‌కు వెళ్లిన షరీఫ్.. వైద్యం పేరుతో వీసా గడువును పెంచుకుంటూ అక్కడే మకాం వేశారు. కాగా.. తాజాగా మరోసారి వీసా గడువు పొడగింపును కోరుతూ ఆయన చేసిన దరఖాస్తును యూకే హోం ఆఫీస్ తిరస్కరించింది. అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ షరీఫ్.
 
నిబంధనలకు విరుద్ధంగా తమ దేశంలో ఉంటున్నారని పేర్కొంది. అంతేకాకుండా దేశం విడిచి వెళ్లాల్సిందిగా షరీఫ్‌ను ఆదేశించింది. యూకే హోం ఆఫీస్ ఇచ్చిన ఆదేశాలపై షరీఫ్ అధికార ప్రతినిధి స్పందించారు. దీనిపై బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్తామని స్పష్టం వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

తర్వాతి కథనం
Show comments