Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాట్సాప్‌కు చెక్... సందేశ్ అనే కొత్త యాప్ ప్రారంభం

Advertiesment
Sandes App
వాట్సాప్ లో సెక్యూరిటీపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి మరో కొత్త యాప్‌ను తీసుకువచ్చింది. సందేశ్‌గా ఆ యాప్‌కు పేరు పెట్టారు. ఈ యాప్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభకు వివరించారు.
 
ఈ యాప్ చాలా సురక్షితమైనదని తెలిపారు. ఈ యాప్‌కు సంబంధించిన నియంత్రణను కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందని తెలిపారు. వాట్సాప్‌లో మాదిరిగా నే వన్ టూ వన్ మెసేజింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్ తదితర ఫీచర్లు ఈ యాప్‌లో ఉండనున్నాయి. 
 
ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉంచుతున్నామని చంద్రశేఖర్ వివరించారు. ఈ యాప్ ను నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్(NIC) అభివృద్ధి చేసింది. NIC తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్ ను లాంఛ్ చేశాయి.
 
కేవలం మొబైల్ నంబర్ తో పాటే కాకుండా ఈమెయిల్ తోనూ ఓపెన్ చేసేలా సందేశ్ యాప్ ను రూపొందించారు. అయితే ఇప్పటివరకు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సర్కారు ఏజెన్సీలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. 
 
ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఫోన్ నంబర్ ను నమోదు చేసి, ఓటీపీని వెరిఫికేషన్ ను పూర్తి చేస్తే ఈ యాప్ ను వాడుకోవచ్చు.
 
ఈ యాప్‌కు వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సందేశ్ వెబ్ పోర్టల్ ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు. అందులో మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీని నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేస్తే సందేశ్ వెబ్ ఓపెన్ అవుతుంది.
 
ఇప్పటివరకు ప్రభుత్వ ఈ మెయిల్ ఐడీతో మాత్రమే సందేశ్ లో ఖాతా తెరవాలనే నిబంధన ఉండేది. అయితే ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాడేపల్లిలోని ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు