Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే నోకియా 110 4జీ

భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే నోకియా 110 4జీ
, శుక్రవారం, 23 జులై 2021 (19:22 IST)
nokia
భారత్ మార్కెట్‌లో రూ. 2799లకే 4జీ ఫీచర్ ఫోన్ ని హెచ్ఎండీ గ్లోబల్ లాంఛ్ చేసింది. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
 
యల్లో ఆక్వా, బ్లాక్ కలర్‌లో లభించే ఈ ఫోన్లు జులై 24 నుంచి అమ్మకాలకు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
 
క్లాసిక్‌, నియోల మేళవింపుతో నోకియా 110 4జీ స్లీక్ న్యూ డిజైన్‌, అసాధారణ ఫీచర్లతో ఆకట్టుకుంటుందని హెచ్ఎండీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సన్మీత్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఈ ఫోన్‌ను సులభంగా వినియోగించడంతో పాటు అందుబాటు ధరలో మెరుగైన నాణ్యతతో కూడిన సీమ్‌లెస్ అనుభూతిని ఇస్తుందని సింగ్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27 క్రిమి సంహారక మందులపై నిషేధం