Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృత్యువాత

Webdunia
సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:25 IST)
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడి రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఈ దాడిలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బందితో సహా 20 మంది చనిపోయారు. 
 
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ పాలకులు స్వాధీనం చేసుకున్న తర్వాత వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాబూల్‌లోని రష్యా దౌత్య కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 

అలాగే, ఈ నెల 2న ఓ మసీదు వద్ద జరిగిన రెండు పేలుళ్ళలో 20 మంది చనిపోయారు.  వీరిలో ప్రముఖ మత నాయుకుడు మజిబ్ ఉల్ రహమాన్ అన్సారీ కూడా ఉన్నారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు.

హెరాత్ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు సంభవించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments