Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 27మంది మృతి.. 50మందికి గాయాలు

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (14:11 IST)
ఫిలిప్పీన్స్‌లోని రోమన్ కాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్ళలో 27మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కేథడ్రెల్ చర్చి సమీపంలో తొలి బాంబు పేల్చారు. ఆ తర్వాత చర్చి ఆవరణలో మరో పేలుడుకు పాల్పడ్డారు. 
 
ఉగ్రదాడిపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్ లోరెన్జనా స్పందించారు. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. 
 
జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో తాజాగా జరిగిన దాడిని కూడా అబు సయ్యఫ్ సంస్థ పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments