Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరూలో ఘోర ప్రమాదం : బస్సు లోయలోపడి 20 మంది మృతి

Webdunia
శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (12:06 IST)
పెరూ దేశంలో ఘోరం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృత్యువాతపడ్డారు. మరో 30 మంది వరకు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తర పెరూలోని లిబర్టాడ్ రీజియన్‌లో జరిగింది. 
 
తయబాంబా నుంచి ట్రుజిల్లోకు వెళుతున్న బససు లిబర్టాడ్ రీజియన్‌లో అదుపుతప్పి లోయలోపడింది. వంద మీటర్ల లోతులో పడిపోవడంతో బస్సు నుజ్జునుజ్జు అయింది. 
 
పలువురు చిన్నారులతో పాటు మొత్తం 20 మంది మృత్యువాతపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ బస్సు అతివేగం, రోడ్లు సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ఈ ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులు వెల్లడించారు. 
 
కాగా, గత యేడాది నవంబరు నెలలో ఉత్తర పెరువియన్ అటవీ ప్రాంతంలో ఓ మినీ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు. రెండు నెలలు గడవక ముందే మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments