Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెరూలో కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

పెరూలో కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి
, శనివారం, 5 ఫిబ్రవరి 2022 (13:56 IST)
పెరూలో విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్​ కోఫైలట్ ఉన్నారు. 
 
నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 వివామంన కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. 
 
పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ  ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. ఇక్కడికి విదేశీ పర్యాటకుల కోసం మారియా రీచే ఎయిర్‌ ఫీల్డ్‌ నుంచి ప్రతిరోజు డజన్ల కొద్ది విమానాలను నడుపుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో 1.27 లక్షల కరోనా కొత్త కేసులు: తగ్గుతున్న పాజిటిటి రేటు