పెళ్ళి కాలేదు. సహజీవనం చేసేందుకు ఒప్పుకుంది. 8 సంవత్సరాల పాటు సహజీవనం చేసింది. అయితే సహజీవనం చేసిన వ్యక్తిని వదిలేసి మరో యువకుడికి దగ్గరైంది. అతనితోను శారీరక బంధం పెట్టుకుంది. తనతో సహజీవనం చేసి వేరొక వ్యక్తితో కలిసి ఉండటాన్ని జీర్ణించుకోలేని వ్యక్తి ఆ మహిళను దారుణంగా చంపేశాడు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	
	 
	ఒంగోలులోని రబ్బాని టీ స్టాల్లో పనిచేస్తున్న కాశీకుమార్కు మధ్య వివాహేతర సంబంధం ఉంది. పెళ్ళి కాకుండానే వీరు 8 సంవత్సరాల పాటు కలిసి ఉన్నారు. అయితే అప్పుడప్పుడు కాశీతో గొడవ జరిగేది రబ్బానికీ. 
 
									
										
								
																	
	
	 
	దీంతో ఆ టీ షాప్కు వచ్చే అలీఫ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది రబ్బానీ. గత నెల రోజుల నుంచి ఈ తంతు సాగుతోంది. తనతో తప్ప వేరే వ్యక్తితో వెళ్ళకూడదన్నాడు కాశీకుమార్. దీంతో ఇరువురు తరచూ గొడవ జరుగుతూ ఉండేది.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	
	 
	ఈ క్రమంలోనే రబ్బానీని నిన్న రాత్రి గొంతునులిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కాశీ. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పంపించగా అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.