Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సు.. ఢీకొట్టిన మరో బస్సు...

Webdunia
సోమవారం, 9 జనవరి 2023 (13:14 IST)
కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుకు అడ్డంగా తిరిగింది. సరిగ్గా అదేసమయంలో వేగంగా వస్తున్న మరో బస్సు.. రోడ్డుపై అడ్డం తిరిగిన బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 70 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం సెనెగల్‌లో జరిగింది. 
 
ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని సెనెగల్ అధ్యక్షుడు మాకే సాల్ వెల్లడించారు. గ్నిబీలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 40 మంది చనిపోగా, అనేక మంది తీవ్ర గాయాలయ్యాయని ఆయన ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నానని చెప్పారు. మృతి పట్ల సోమవారం నుంచి మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. రోడ్డు భద్రతా చర్యలపై చర్చించేందుకు అంతర్ మంత్రిత్వ మండలిని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 
 
అలాగే, ఈ ప్రమాదంపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ చీక్ డియోంగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ బస్సు టైరు పంక్చర్ కావడంతో రోడ్డుపై బస్సు అడ్డం తిరిగిందని, ఆ సమయంలో ఎదురుగా వస్తున్న మరో బస్సు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుందని తెలిపారు. ఈ ఘటనలో 78 మందికి గాయాలయ్యాని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments