మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం... 25 మంది సజీవదహనం!

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం వేకువజామున జరిగిన ఈ విషాద ఘటనలో విద్యార్థులు, వార్డెన్లు సహా 25 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (10:29 IST)
మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం వేకువజామున జరిగిన ఈ విషాద ఘటనలో విద్యార్థులు, వార్డెన్లు సహా 25 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న ఓ రెండస్థుల మత పాఠశాల హాస్టల్‌లో ఈ ప్రమాదం సంభవించింది.
 
గురువారం తెల్లవారుజామున నగరంలోని జలాన్ దాతుక్ కెర్మాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని, మృతుల్లో ఎక్కువ మంది 5 నుంచి 18 ఏళ్ల లోపువారు ఉన్నట్టు సమాచారం. కాగా, ఇప్పటివరకు 23 మంది మృతి చెందినట్టు మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే, మృతుల సంఖ్య 25 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాల సమాచారం. 
 
ఈ ఘటనపై ప్రధాని నజీబ్‌ రజాక్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. గత రెండు దశాబ్దాలలో మలేషియాలోని పాఠశాల్లో చోటుచేసుకున్న అతిపెద్ద అగ్నిప్రమాదం ఇదేనని చెప్పారు. బెడ్‌రూమ్‌లో ఏర్పడ్డ మంటలు కొంత సమయానికే భవనం మొత్తం వ్యాపించడంతో ఎక్కువ మరణాలు సంభవించినట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ ఖిరుదిన్ ద్రాహ్మాన్ చెప్పారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

తర్వాతి కథనం
Show comments