Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి - 22 మంది మృతి

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (12:37 IST)
గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. నెలలు గడిచిపోతున్నప్పటికీ ఈ యుద్ధానికి అంతం అనేది కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
మరోవైపు, ఉక్రెయిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై రష్యా ఎన్ని దాడులు చేసినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు ఇతర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. 
 
తాజాగా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూనైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు వీడీయో ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులు మొదలుపెట్టిన ఆరు నెలల వ్యవధిలో తమ దేశ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున రష్యా చేసిన ఈ దాడి అసహ్యమైనదన్నారు. 
 
తమను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. రష్యా చేసిన ప్రతి దానికీ ఆ దేశం బాధ్యత వహించేలా చేస్తామన్నారు. తాజాగా జరిపిన క్షిపణి దాడిలో మరో 22 మంది చనిపోయారని జెలెన్ స్కీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments