Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస పండ్లను ప్రతిరోజూ తింటే...(video)

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (09:24 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో చాలా మంది పనస పండును తినేందుకు ఆసక్తిని చూపిస్తారు.
 
సాధారణంగా ఈ పండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్ల కన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు అందిస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే అసలు పనస పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 
 
* పనస పండ్లలో విటమిన్ ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. 
* పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. 
* పనస పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వాపులను తగ్గిస్తుంది. 
* పనస పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. 
* గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
* పనస పండును తరచూ తీసుకుంటుంటే అలాంటి ముడతలు ఏర్పడవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 
* రుచి తియ్యగా ఉన్నప్పటికీ పనస పండ్లు షుగర్ లెవల్స్‌ను పెంచవు. 
* ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి. 
* డయాబెటిస్ ఉన్న వారు కూడా పనస పండ్లను నిర్భయంగా తినవచ్చు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Elon Musk: నేను లేకుంటే, ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవాడు: ట్రంప్‌పై ఫైర్ అయిన ఎలోన్ మస్క్

Sharmishta: శర్మిష్ట పనోలికి మధ్యంత బెయిల్ మంజూరు చేసిన కోల్‌కతా హైకోర్టు

What is a Super-Earth?: కెప్లర్-725c అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్న చైనా!

Indore Man: హనీమూన్ ట్రాజెడీ: రాజా మృతి.. భార్య సోనమ్ ఎక్కడ? సీబీఐ దర్యాప్తుకు డిమాండ్

Mahua Moitra: జర్మనీలో హువా మొయిత్రా, పినాకి మిశ్రా వివాహం జరిగిపోయిందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

తర్వాతి కథనం
Show comments