Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస పండ్లను ప్రతిరోజూ తింటే...(video)

ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (09:24 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండ్లు ఒకటి. ఇవి సీజనల్ పండ్లు. కేవలం దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా లభిస్తాయి. ఇక ఈ పండ్ల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో తియ్యగా, రుచికరంగా ఉంటాయి. దీంతో చాలా మంది పనస పండును తినేందుకు ఆసక్తిని చూపిస్తారు.
 
సాధారణంగా ఈ పండు రుచి ఇతర పండ్ల కన్నా భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఇతర పండ్ల కన్నా భిన్నమైన ప్రయోజనాలను ఈ పండు అందిస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అవి మన శరీరానికి శక్తినిస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. అయితే అసలు పనస పండును తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం. 
 
* పనస పండ్లలో విటమిన్ ఎ, సి లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వైరల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. 
* పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి. మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయి. 
* పనస పండులో ఉండే విటమిన్ సి గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. వాపులను తగ్గిస్తుంది. 
* పనస పండ్లలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. 
* టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి మేలు చేస్తాయి. 
* గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. హై బీపీ, హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. 
* పనస పండును తరచూ తీసుకుంటుంటే అలాంటి ముడతలు ఏర్పడవు. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. 
* రుచి తియ్యగా ఉన్నప్పటికీ పనస పండ్లు షుగర్ లెవల్స్‌ను పెంచవు. 
* ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని షుగర్ లెవల్స్‌ను అమాంతం పెరగకుండా చూస్తాయి. 
* డయాబెటిస్ ఉన్న వారు కూడా పనస పండ్లను నిర్భయంగా తినవచ్చు. 
 
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments