Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు ఐదంటే ఐదు చాలు...

ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారుండరు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు.

Webdunia
సోమవారం, 30 జులై 2018 (16:44 IST)
ద్రాక్ష పండ్లను ఇష్టపడని వారుండరు. అయితే, పచ్చి ద్రాక్షలో కంటే ఎండు ద్రాక్షలోనే పోషకాలు పుష్కలంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెపుతున్నారు. అందుకే రోజుకు 5 ఎండు ద్రాక్షలను తింటే చాలని వారు అంటున్నారు. దీనికి కారణం ఈ ఎండు ద్రాక్షలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండటమేకాకుండా, సహజసిద్ధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని అంటున్నారు. ఈ ఎండు ద్రాక్ష ఆరగిస్తే కలిగే లాభాలను ఓసారి పరిశీలిద్ధాం.
 
* ఇందులో ఉండే ఫైబర్ వల్ల ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ప్రతిరోజు రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండు ద్రాక్షలు తీసుకోవడం వల్ల ఉదర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
* పొటాషియం నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. 
* ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ప్రతి రోజూ ఓ కప్పు నీటిలో 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను నానబెట్టాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. 4 - 5 గంటల  తర్వాత ఎండు ద్రాక్షను నమలాలి. ఇలాక్రమం తప్పకుండా చేస్తే అనీమియా వ్యాధి దూరమవుతుంది. 
* ఎండు ద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇవి పళ్లను, చిగుళ్లను దృఢంగా ఉండేలా చేస్తాయి. 
* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల కేన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి. 
* ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా ఆరగించడం వల్ల ఇందులోని క్యాల్షియం కీళ్ల నొప్పులను మటుమాయం చేస్తుంది. 
* అన్నిటికంటే ముఖ్యంగా, ప్రతిరోజు ఎండు ద్రాక్షను తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పోతాయి. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది. 
* ఎండు ద్రాక్షలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇవి కంటి చూపును మెరుగుపడటానికి సాయపడతాయి. 
* పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష సహజమైన వేడిని అందిస్తుంది. దీనివల్ల పిల్లలు రాత్రిపూట పక్కలో మూత్రవిసర్జన చేయరు. 
* ఎండు ద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. 

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలను పక్కనబెట్టేయాల్సిందే.. సీఎం జగన్

కవిత బెయిల్ పిటిషన్- తీర్పును రిజర్వ్ చేసిన అవెన్యూ కోర్టు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ప్రథమ స్థానంలో ములుగు

కేసీఆర్‌కు తప్పిన ప్రమాదం.. వేములపల్లి వద్ద వాహనాల ఢీ

భర్తను అన్నయ్య హత్య చేశాడు.. భార్య ఆత్మహత్య చేసుకుంది.. కారణం?

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments