Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్సర్‌కు విరుగుడు జీబ్రా ఫిష్...

ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌కు మందు లేదు. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే, రేడియేషన్‌ చేయడం వల్ల కేన్సర్ బారి నుంచి కొంతమేరకు బయటపడొచ్చు. అ.యితే, కేన్సర్ వ్యాధికి వి

Webdunia
శనివారం, 21 జులై 2018 (12:35 IST)
ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధి కేన్సర్‌కు మందు లేదు. ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే, రేడియేషన్‌ చేయడం వల్ల కేన్సర్ బారి నుంచి కొంతమేరకు బయటపడొచ్చు. అ.యితే, కేన్సర్ వ్యాధికి విరుగుడుగా ఓ చేపను కనుగొన్నారు. ఈ చేపను ఆరగించడం వల్ల కేన్సర్ బారిన పడొచ్చని అంటున్నారు.
 
అయితే, ఈ చేప ఎక్కడపడితే అక్కడ లభించదు. చాలా అరుదైన చాప. ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు నియంత్రణలకు లోబడి కోతులు, ఎలుకలు వంటి జీవులపై చేస్తున్న ఔషధ ప్రయోగాలను కొత్త బాట పట్టించింది. మానవుల మాదిరిగా అవయవాలను కలిగి ఉండటం శతకోటి మత్స్యాల్లో ఒక చేపైన ఈ జీబ్రా ఫిష్‌ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అంతేకాదు.. ఈ అవయవాలను పునరుత్పత్తి చేసుకోగల సామర్థ్యం కారణంగా శాస్త్రవేత్తలు వీటిని ప్రయోగాలకు ఎంపిక చేసుకొంటున్నారు. 
 
ప్రస్తుతం ఈ జీబ్రా ఫిష్‌ను వివిధ రకాల కేన్సర్‌లకు ప్రత్యేకమైన మందులు కనిపెట్టే పరిశోధనల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ చేపల్లో కేన్సర్ ట్యూమర్లను ఎక్కించి వివిధ రకాల ఔషధాల శక్తిసామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. దీనివల్ల మానవులకు ప్రతి ఒక్క కేన్సర్‌కు ప్రత్యేకమైన మందులు, చికిత్సా విధానం తయారు చేయడం వీలవుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ప్రస్తుతం సీసీఎంబీ జీబ్రా ఫిష్‌లో బ్రెస్ట్ కేన్సర్‌పై పరిశోధనలు జరుపుతోంది. చేపలో ట్యూమర్ ప్రవేశపెట్టి కణాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి? వాటి విస్తరణ, మందులతో వాటిని నియంత్రించే విధానాలను పరిశీలిస్తున్నారు. కేన్సర్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌, టీబీ, మానసిక ఆరోగ్యం, అండోత్పత్తి వంటి వివిధ రకాల పరీక్షలు, పరిశీలనల దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments