Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకుకూరలతో ఆయుష్షు పెంచుకోండి..

అవునండి.. ఆకుకూరలతో ఆయుష్షును పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలను రోజు ఒక కప్పైనా డైట్‌లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరమవుతాయని వారు చెప్తున్నారు. ఆకుకూరల్లో చాలా ప్ర

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (10:00 IST)
అవునండి.. ఆకుకూరలతో ఆయుష్షును పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆకుకూరలను రోజు ఒక కప్పైనా డైట్‌లో చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు పూర్తిగా దూరమవుతాయని వారు చెప్తున్నారు. ఆకుకూరల్లో చాలా ప్రోటీన్స్ వుంటాయి. ఆకుకూరల్లో పలురకాలు వుంటాయి. రోజుకో ఆకుకూర డైట్‌లో చేర్చుకోవాలి. ఆకు కూరల్లో పొన్నగంటి కూరకు చాల ప్రత్యేకమైన స్థానం ఉంది. 
 
ఎందుకంటే ఇందులో అనేక పోషక విలువలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పొన్నగంటి కూరలో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉంటాయి. ఇంకా శరీరానికి తోడ్పడే ఎమినో ఆమ్లాలు పొన్నగంటి కూరలో పుష్కలంగా వున్నాయి.
 
మొలలతో బాధ పడేవారికి పొన్నగంటి కూర ఆకులు, చిన్న ఉల్లిపాయలు, మిరియాలతో చేసిన సూప్ త్రాగితే మంచిది. పొన్నగంటి కూరలో లభించే నూనే పదార్థాలు అధిక రక్త పోటును తగ్గిస్తాయి. అంతేకాదు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా చేసి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. పొన్నగంటి ఆకులు నిద్రలేమిని దూరం చేస్తాయి. జ్ఞాపక శక్తిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు పెరగాలనుకునే వారు కందిపప్పు, నెయ్యితో పొన్నగంటి కూరను కలిపి తీసుకుంటే బరువు పెరుగుతారు. శరీరానికి మేలు చేయడంతో పాటు పొన్నగంటి కూరను తీసుకోవడం ద్వారా శరీర ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు పొన్నగంటి కూరను ఉడికించి ఉప్పు, మిరియాల పొడి చేర్చి తీసుకోవాలి.

గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చునే వారికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. కంటి సమస్యలు ఏర్పడుతాయి. అలాంటి సమస్యలు ఎదురైతే.. పొన్నగంటి ఆకుతో తాలింపు చేసుకుని తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments