Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్తపోటు వున్నవారు ఈ 3 పనులు చేస్తే...?

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:43 IST)
రక్తపోటు వున్నవారు ఆందోళన చెందకూడదు. విపరీతమైన కోపం పనికిరాదు. శాంతంగా వుండాలి. రక్తపోటును అదుపులో పెట్టుకునేందుకు ఈ చిట్కాలు పాటిస్తే కూడా ప్రయోజనం వుంటుందని వైద్యులు చెపుతున్నారు.
 
నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకోవటం వల్ల మహిళల్లో రక్తపోటు 14 పాయింట్లు తగ్గుతున్నట్టు బయటపడింది. ఈ ప్రక్రియ ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో రక్తనాళాలు వదులుగా అవుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది.
 
అలాగే పచ్చని ప్రకృతి దృశ్యాలను చూసినప్పుడు మెదడులో హాయిని కలిగించే అల్ఫా తరంగాలు పుట్టుకొస్తాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును పెంచే కార్టిజోల్‌ హార్మోన్‌ ఉత్పత్తినీ తగ్గిస్తాయి. కాబట్టి గోడ మీద ప్రకృతి దృశ్యాల చిత్రాలను అలంకరించుకోవటం మంచిది.
 
ఇకపోతే కుర్చీలో ముందుకు వంగి కూచున్నప్పుడు రక్తపోటు పదహారు శాతం వరకు పెరుగుతుంది. మన మెడలో ప్రశాంతతకు సంబంధించిన సందేశాలను మెదడుకు చేరవేసే నాడులుంటాయి. ముందుకు వంగటం వల్ల మెడలోని వెన్నుపాము, డిస్కుల మీదా ఒత్తిడి పడుతుంది. దీంతో ఆ భాగంలోని సున్నితమైన నాడులు నొక్కుకుపోయి వాటి పనితీరు మందగిస్తుంది. అందువల్ల వీలైనంతవరకు నిటారుగా కూచుంటే మంచిది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments