Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటి అలసటను గుర్తిస్తున్నారా? ఎలా తగ్గించాలంటే?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (18:53 IST)
కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేసినా, ఎక్కువ సేపు టీవీ చూసినా తలనొప్పి వస్తుందంటే. అందుకు కారణం కళ్లు అలసటకు గురయ్యాయని అర్థం. ఈ ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే. అలసట లక్షణాలను గుర్తించి కళ్లకు విశ్రాంతిని ఇవ్వాలి. 
 
కళ్ల మసకలు, తలనొప్పి, కంటి నుండి నీరు కారడం, కంటి మంటలు మొదలైన లక్షణాలు కనిపిస్తుంటే కళ్లు అలసిపోతున్నాయని అర్థం చేసుకోవాలి. ఇందుకు చాలా కారణాలుంటాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం. ఎస్థినోపియా అనే కళ్ల అలసటకు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వాడడం ప్రధాన కారణాలు. 
 
వీటితోపాటు చిన్నవిగా ముద్రించిన అక్షరాలను చదవడం, తగిన వెలుతురు లేని చోట కూర్చుని చదవడం వంటి అలవాట్ల వలన కంటి కండరాల మీద ఒత్తిడి పడి కళ్లు అలసటకు లోనవుతాయి. దాంతో డబుల్ ఇమేజ్, తలనొప్పి, మైల్డ్ మ్రైగ్రేన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. 
 
ఈ లక్షణాలు కనిపించినప్పుడు కంటి మీద పడే ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం తప్పకుండా చేయాలి. కంప్యూటర్ ముందు అదేపనిగా పనిచేసే వాళ్లు ప్రతిరెండు గంటలకోసారి పని ఆపేసి కనీసం 10 నిమిషాలు కళ్లకు విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. 
 
అప్పుడప్పుడూ దూరం, దగ్గర వస్తువులను చూసే కంటి వ్యాయామాలు చేయాలి. కళ్లను మూసి రెండు దోసిళ్లను కళ్ల మీద ఉంచి మోచేతులను టేబుల్ మీద ఆనించి 5 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. చల్లని నీటిలో తడిపిన దూదిని మూసిన కనురెప్పల మీద 5 నిమిషాల పాటు ఉంచితే కళ్ల మంటలు తొలగిపోతాయి. 
 
కంటి నుండి నీరు కారుతున్నా, లేదా దురదలు పెడుతున్నా కళ్లు నులుముకోకుండా వైద్యుల్ని సంప్రదించాలి. మెడికల్ షాపులో దొరికే ఐ డ్రాప్స్‌ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. రోజుకు కనీసం ఏడు గంటలపాటైనా నిద్రపోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments