పిల్లలకు బ్రెడ్ తినిపించి స్కూలుకు పంపుతున్నారా?

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (18:42 IST)
ఉదయం అల్పాహారం చేసే ఓపిక లేని కొంత మంది తల్లులు పిల్లలకు బ్రెడ్ తినిపించి స్కూల్‌కి పంపిస్తుంటారు. పెద్దలు కూడా టీలు, కాఫీలతోపాటు బ్రెడ్ తింటుంటారు. బ్రెడ్‌తో తయారు చేసిన వివిధ వంటకాలను కూడా చాలా మంది తింటుంటారు. అయితే బ్రెడ్ అరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఉదయం పూట బ్రెడ్ తింటే గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో పాటు డ్రిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్రెడ్‌లో ఉండే గ్లూటెన్ అనే ఆమ్లం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీంతో మెదడు పనితీరు మందగించి ఒత్తిడి పెరుగుతుంది. తప్పనిసరి పరిస్థితులలో తినవలసి వస్తే, తిన్న తర్వాత ఏదైనా పండు తినాలని సూచిస్తున్నారు. 
 
కానీ రెగ్యులర్‌గా మాత్రం బ్రెడ్‌ని తీసుకోకూడదట. బ్రెడ్ సాధారణంగా ఏ రూపంలోనూ శరీరానికి పోషకాలు అందించదు. అయితే గోధుమ బ్రెడ్ మాత్రం కొంత పరిమాణంలో పోషకాలు అందిస్తుంది. బ్రెడ్‌లో అధిక రక్తపోటుకు కారణమయ్యే సోడియం లెవల్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దీనిలో ఉప్పు అధికంగా ఉండటం వలన పలు రూపాల్లో తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. 
 
బ్రెడ్ సంబంధిత పదార్థాలైన కేకులు, బర్గర్లు వంటివి తీసుకుంటే కూడా చక్కెర స్థాయిలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బతికుండగా వారిని కలవనివ్వలేదు ... కనీసం చావులోనైనా వాళ్లను కలిసుండనీయండి...

ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న రెండు రోజులు జాగ్రత్త

పాకిస్థాన్‌లో మళ్లీ భగ్గుమన్న ఇంధన ధరలు - లీటర్ డీజిల్ ధర రూ.520

భార్యతో గొడవపడి.. ముక్కు - చెంపలు కొరికేసిన భర్త

అమరావతి ఇక అజేయం.. ఆంధ్రులకు గర్వకారణం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karmeni Selvam Review: సముంద్రఖని నటించిన కార్మేని సెల్వం ఎలా వుందంటే... కార్మేని సెల్వం రివ్యూ

Biker Review: బైక్ రేసింగ్ రైడ్ తో శర్వానంద్, రాజశేఖర్ గట్టెక్కించారా - బైకర్ రివ్యూ

ఫ్యామిలీ అంతా హాయిగా నవ్వుకునేలా రాకాస ఉంటుంది : నిహారిక కొణిదెల

Amba’s Revenge: తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’s రివెంజ్

శ్రీనివాస మంగాపురం నుంచి స్వాతంత్ర బాబు గా డా. నరేష్ వికే

తర్వాతి కథనం
Show comments