Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో చేపలు అస్సలు తినకూడదా... ఎందుకని? (video)

Webdunia
బుధవారం, 3 జులై 2019 (11:26 IST)
మాంసాహారాల్లో చేపలు అన్నింటి కన్నా బెస్ట్ అని చెబుతారు. దీని వలన అనేక పోషకాలు అందుతాయి. కానీ వర్షాకాలంలో మాత్రం వీటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదు. చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఐతే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. 
 
ఈ సీజన్‌లో చేపలతో పాటు ఇతర మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ అది మంచిది కాదు. శీతలీకరణ చేప మాంసం వర్షాకాలంలో తినకూడదు. పాడవకుండా ఉండేందుకు వాటిపై సల్ఫేట్స్, పాలి ఫాస్పేట్స్ పూస్తారు. కానీ 10 రోజుల తర్వాత అవి తొలగిపోతాయి. ఆ తర్వాత మాంసంపై బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుతుంది. అలాంటి మాంసం తింటే రోగాలు వస్తాయి.
 
వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ, మలినాలు అంత సులభంగా తొలగిపోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదముంది. వర్షాకాలంలో మీ జీర్ణశక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. 
 
భారీగా ఏదైనా తినడం వలన జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. వర్షాకాలంలో అపరిశుభ్ర చేపలను తింటే శ్వాస, హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments