Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో చేపలు అస్సలు తినకూడదా... ఎందుకని? (video)

Webdunia
బుధవారం, 3 జులై 2019 (11:26 IST)
మాంసాహారాల్లో చేపలు అన్నింటి కన్నా బెస్ట్ అని చెబుతారు. దీని వలన అనేక పోషకాలు అందుతాయి. కానీ వర్షాకాలంలో మాత్రం వీటి జోలికి వెళ్లడం అంత మంచిది కాదు. చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఐతే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. 
 
ఈ సీజన్‌లో చేపలతో పాటు ఇతర మాంసాహారం తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ అది మంచిది కాదు. శీతలీకరణ చేప మాంసం వర్షాకాలంలో తినకూడదు. పాడవకుండా ఉండేందుకు వాటిపై సల్ఫేట్స్, పాలి ఫాస్పేట్స్ పూస్తారు. కానీ 10 రోజుల తర్వాత అవి తొలగిపోతాయి. ఆ తర్వాత మాంసంపై బ్యాక్టీరియా, ఈస్ట్ పెరుగుతుంది. అలాంటి మాంసం తింటే రోగాలు వస్తాయి.
 
వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. చేపలను బాగా కడిగినప్పటికీ, మలినాలు అంత సులభంగా తొలగిపోవు. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదముంది. వర్షాకాలంలో మీ జీర్ణశక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. 
 
భారీగా ఏదైనా తినడం వలన జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. వర్షాకాలంలో అపరిశుభ్ర చేపలను తింటే శ్వాస, హృదయ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. అందుకే వర్షాకాలంలో మాంసాహారం ఎక్కువగా తింటే మంచిది కాదంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

తర్వాతి కథనం
Show comments