Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చేపల వాసన పోవాలంటే.. ఇలా చేయండి..

చేపల వాసన పోవాలంటే.. ఇలా చేయండి..
, మంగళవారం, 2 జులై 2019 (15:23 IST)
పసిపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాంబ్రాణి పొగ వేయడం సహజం. ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలు, క్రిమికీటకాలు సాంబ్రాణి పొగతో దూరమవుతాయి. సాంబ్రాణితో ఇల్లంతా మంచి సువాసనను సంతరించుకుంటుంది. కర్పూరాన్ని కూడా ఇలాంటి ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. 
 
కర్పూరాన్ని వెలిగిస్తే సువాసన కాసేపు మాత్రమే ఉంటుంది. కానీ అలా చేయకుండా ఆరు కర్పూరం బిళ్లలను తీసుకుని అందులో అగరొత్తుల పొడి కలిపి ఇంట్లో లేదా స్నానాల గదిలో ఉంచి చూడండి. ఫలితం మీకే కనబడుతుంది. వాసన ఎక్కువ సేపు ఉంటుంది. పైగా కర్పూర పరిమళానికి ఈగలు కూడా దరిచేరవు. ఇంకా నిమ్మ, లావెండర్‌, దాల్చిన చెక్క నూనెలు బయట అమ్ముతారు. 
 
ఇవి ఇంట్లో పరిమళాలను వెదజల్లడంతోపాటు ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. వీటిలో దూదిని ముంచి ఓ గదిలో పక్కన పెడితే చాలు, ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది. అలాగే రంధ్రాలున్న చిన్న గిన్నె తీసుకుని అందులో కొన్ని కాఫీ గింజల్ని నింపి మూత పెట్టాలి.
 
ఈ గిన్నెను వంటింట్లో ఓ మూలన ఉంచాలి. కాఫీ గింజలు ఇతర దుర్వాసనల్ని పీల్చుకుని వాటి వాసనల్ని వెదజల్లుతుంటాయి. మసాలా వాసన, చేపల వాసన పోవాలంటే, స్ప్రే సీసాలో వెనిగర్‌ని తీసుకుని వంటిల్లూ, ఇతర గదుల్లో చల్లి చూస్తే మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేరేడు పండ్లు తింటే.. ఇక డయాబెటిస్ దరిదాపుల్లోకైనా రాదట..