పెరుగులో వాము కలిపి తీసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:41 IST)
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటి వేసవి కాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. పెరుగు తీసుకోవడం వలన వేసవి తాపంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పెరుగుని కింద సూచించిన విధంగా ఉపయోగిస్తే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.. 
 
కప్పు పెరుగులో కొద్దిగా నల్ల మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపునొప్పితో బాధపడేవారు తరచు పెరుగులో వాము కలిపి తింటే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
నల్ల ఉప్పును బాగా పొడి చేసుకోవాలి. ఈ ఉప్పును కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. కప్పు పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తింటుంటే కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, అల్లం కలిపి తినాలి. ఇలా చేయడం వలన శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలురకాల ఇన్‌ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది.     

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments