కాగితం ఎలా వచ్చింది?

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:20 IST)
ప్రాచీన ఈజిప్టియన్లు నైలు నదీ తీరాల్లో పెరిగే పాపిరస్ అనే ఒక రకం గడ్డి మొక్క నుంచి రాయడానికి అనువైన కాగితం వంటి దాన్ని తయారు చేశారు. ఆ "పాపిరస్" అనే ఈజిప్ట్ పదం నుంచే "పేపర్" అనే పదం పుట్టింది. 
 
ఆ తరువాత చాలా కాలానికి చైనీయులు చెక్కతో గుజ్జు తయారుచేసి, దాన్ని బల్లపరుపుగా పరిచి, ఆరబెట్టి, కాగితాన్ని తయారు చేయడం ప్రారంభించారు. అదే పద్ధతిని అరబ్బులు ఇంకాస్త మెరుగుపరిచి, మెరుగైన కాగితాన్ని తయారు చేసారు. 
 
ఆ తరువాత ఆధునిక పద్ధతులు వచ్చి, రకరకాల కాగితాలు తయారయ్యాయి. అయితే పాపిరస్ మొక్క వల్లే మనకు పేపర్ వచ్చిందని గుర్తుంచుకోవాలి. 
 
పాపిరస్ నుంచి కాగితాన్ని తయారు చేయడమే కాకుండా చాపలు, బుట్టలు, తాళ్లు, చెప్పులు, పడవలు తయారు చేసేవారు. ఈ మొక్క వేరుని ఔషధంగానూ, ఆహారంగానూ, సుగంధద్రవ్యంగానూ ఉపయోగించేవారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హిందూ మతం అనేది ఒక జీవన విధానం : సుప్రీంకోర్టు

ఇంధన పొదుపు .. కాన్వాయ్‌లోని వాహనాలు తగ్గించండి : చంద్రబాబు ఆదేశం

బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయమంటే నన్ను పోలీసు స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు: బక్క జడ్సన్

రూ. 30 వేలు తీసుకున్న లంచగొండి మైనింగ్ అధికారిని పట్టుకుంటే రూ. 4 కోట్లు బయటపడ్డాయి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్‌ఫ్లవర్ రైతుల నిరసనలు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nattikumar: తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రజాస్వామ్య పద్ధతులు లేకుండానే కొనసాగుతోంది

ఎగ్జిబిటర్ల సమస్యల పరిష్కారినికి సిద్ధం - దానితోపాటు నిర్మాతల సమస్య లూ పరిష్కారం కావాలి

Nag Ashwin: రుత్విక్ కి రాజా ది రాజా జస్ట్ బిగినింగ్ మాత్రమే : నాగ్ అశ్విన్

Anil Ravipudi: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన శ్రీనివాస మంగపురం లోని మంగా మంగా సాంగ్

మరో గ్లోబల్ రికార్డ్ క్రియేట్ చేసిన విరోష్ జోడి.. కపుల్ యాడ్ కు 9.1 మిలియన్ లైక్స్

తర్వాతి కథనం
Show comments