మహాశివరాత్రి రోజున సాయంత్రం.. ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (11:00 IST)
ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున శివరాత్రి వస్తూనే ఉంటుంది. దీనినే మాసశివరాత్రి అంటారు. ఈ రోజున శివునికి ఆలయాల్లో విశేష పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చే మహాశివరాత్రిని చాలా విశిష్టమైనదిగా పండితులు చెప్తున్నారు. ఓ రోజూ పార్వతిదేవి ఈశ్వరుని శివారాత్రి గురించి అడుగుతారు. అప్పుడు శివుడు ఇలా అంటారు.. శివరాత్రి ఉత్సవం నాకెంతో ఇష్టమనీ, ఇంకేమి చేయకుండా ఆ ఒక్క రోజు మాత్రం ఉపవాసమున్నాసరే నాకెంతో సంతోషంగా ఉంటుందని చెప్తారు.
 
ఈశ్వరుడు చెప్పిన మాట ప్రకారం పార్వతీ ఆ రోజు పగలంతా నియమనిష్టతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో ఆ తరువాత పెరుగుతో, ఆపై నేతితే, తేనెతో అభిషేకం చేస్తారు. మరునాడు బ్రహ్మవిదులకు భోజనం పెట్టి ఆమె భుజించే శివరాత్రి వ్రతం సమాప్తి చేస్తుంది. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటారు పరమేశ్వరుడు. 
 
మహాశివరాత్రి నాడు ఉదయం 5 గంటలకు నిద్రలేచి.. శుచిగా తలస్నానం చేసి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తరువాత గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులు, రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆపై తెలుపు రంగు బట్టలను ధరించి.. శివుని మాటలు, లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి.
 
ఇక మారేడు దళాలు, తెల్లపువ్వుల మాలతో భోళాశంకరుని అలంకరించి.. నైవేద్యంగా పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామకాయలను సమ్పరించి నిష్టతో పూజించాలని పండితులు చెప్తున్నారు. పూజ సమయంలో శివఅష్టోత్తరం, శివపంచాక్షరీ మంత్రాలను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు, సిరిసంపదలు చేకూరుతాయని వారు చెప్తున్నారు. 
 
చివరగా నిష్టతో ఉపవాసముండి శివసహస్త నామం, శివ పురాణం, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలానే శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో స్వామివారికి పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతున్నారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గిల్లితే కాటేస్తాం, ఇరాన్ వార్నింగ్: ట్రంప్ 5 అడుగులు వెనక్కి, యుద్ధం విరమణ అంటూ...

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేదే హవా.. టీవీకే, ఎన్టీకేలకు ఓటమి తప్పదు.. సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు.. టీవీకే 30మంది అభ్యర్థుల జాబితా రిలీజ్

సువర్ణాధ్యాయం లిఖించిన 'బ్లాక్ టైగర్' : ఎవరీ అసమాన దేశభక్తుడు!!

కోతుల గుంపు దాడి.. కాకినాడలో 65 ఏళ్ల వృద్ధురాలు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

తర్వాతి కథనం
Show comments