Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ఒక్క ఖాకీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : టీడీపీ నేత యరపతినేని

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:06 IST)
2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఆ తర్వాత తమను వేధించిన, తమపై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అంతు చూస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు హెచ్చరించారు. 
 
ఇటీవల మాచర్ జిల్లాలో వైకాపా నేతలు చేసిన దమనకాండపై ఆయన మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. మాచర్లలో జరిగిన అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు భయపెడుతున్నారన్నారు. పైగా, మాచర్లలో సైతం భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. 
 
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన, పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్, అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ఆరిపోయే దీపమని, రానున్న రోజుల్లో వైకాపా నేతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై వేధింపులకు గురిచేసినా టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments