Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉన్నావో అత్యాచార నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేస్తారా? కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి, ఆపై రీకన్ట్రక్షన్

Webdunia
శనివారం, 7 డిశెంబరు 2019 (17:03 IST)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావోలో వుండే ఆడపిల్లలు వణికిపోతున్నారు. ఎందుకంటే... అక్కడ గత 11 నెలల్లో ఏకంగా 86 అత్యాచారాలు జరిగాయి. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే కామాంధులు కాటేస్తున్నారు. మరోవైపు తనపై అత్యాచారం చేసిన నిందితులకు శిక్ష పడాలని మొక్కవోని ధైర్యంతో కోర్టు చుట్టూ తిరుగుతున్న బాధితురాలుని పొట్టనబెట్టుకున్నారు నిందితులు. ఆమె కోర్టుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై నిప్పుపెట్టారు.
 
ఐతే, బాధితురాలు మంటలతోనే రోడ్డుపై ప్రయాణించి అంబులెన్సుకి తనే ఫోన్ చేయాల్సిన దీన స్థితి అక్కడ నెలకొంది. ఎంత దారుణం? ఆ దారుణ ఘటనలో ఆమె 90 శాతం గాయాలపాలై నిన్నటివరకూ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. కానీ నిందితులకు శిక్ష పడేవరకూ విశ్రమించవద్దని తన సోదరుడితో చివరి మాటగా చెప్పింది. ఆమెను పొట్టనబెట్టుకున్న కామాంధులు ఎంతటి సాహసం చేసారంటే, నవంబర్ 27న ఈ కేసులో బెయిల్ పైన బయటకు వచ్చి వెంటనే బాధితురాలికి నిప్పంటించారు. దీన్నిబట్టి అర్థమవుతుంది... ఆ కామాంధుల గుండెధైర్యం ఎంతటిదో?

 
 
మరోవైపు వరసబెట్టి యువతులపై అత్యాచారాల పరంపర సాగుతుండటంతో యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ ఉక్కిరిబిక్కిరయిపోతోంది. ఈ నేపధ్యంలో ఈ కేసులో నిందితులను కూడా తెలంగాణ దిశ నిందితుల మాదిరిగా ఎన్ కౌంటర్ చేయాల్సిందేనంటూ మహిళా సంఘాలు కోరుతున్నాయి. మరి యోగి సర్కారు ఏం చేస్తుందన్నది చూడాల్సి వుంది.
 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments