Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు : ముఖేష్ అంబానీ

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (15:30 IST)
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబై వేదికగా జరిగింది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 5జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 
 
వందకు వంద శాతం స్వదేశీయంగా తయారైన 5జీ సొల్యూషన్‌ను పరీక్షించామని, ఈ పరీక్షలో 1జీబీపీఎస్ స్పీడ్‌ను విజయవంతంగా అందుకున్నట్టు చెప్పారు. జియో 5జీ నెట్‌వర్క్‌ సేవలు ప్రారంభించేందుకు రెగ్యులేటరీ అనుమతులు కూడా వచ్చాయని తెలిపారు. 
 
ఇపుడు 5జీ ఫీల్డ్ కసరత్తులు చేస్తున్నామని తెలిపారు. దేశీయంగా తామే తొలుత 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైద్య రంగంలో కూడా 5జీ సేవలు ఉపయోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. 
 
దీంతో పాటు విద్యా రంగంలో కూడా 5జీ సేవలన్ని అందిస్తామని తెలిపారు. గూగుల్‌తో కలిసి తయారు చేసిన జియో ఫోన్ నెక్స్ట్‌ వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 10వ తేదీన విడుదల చేస్తామని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments