Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిలయన్స్ జియో నుంచి 5జీ నెట్‌వర్క్ ఫోను.. దీపావళి కల్లా వచ్చేస్తుందా?

Advertiesment
jioservice
రిలయన్స్ జియో నుంచి అతి త్వరలో దేశంలో 5జీ నెట్‌వర్క్ ఫోను అందుబాటులోకి రానుంది. ఇదే నెలలో 5జీ సర్వీస్‌లను లాంచ్ చేసేందుకు జియో రెడీ అయ్యింది. ఈ 5జీ చౌకైన మొబైల్‌కు సంబంధించిన కొన్ని విషయాలు తాజాగా బయటికి వచ్చాయి. ఇప్పటికే కీలక స్పెసిఫికేషన్లు, అంచనా ధర విషయాలు లీకయ్యాయి. 
 
జియో ఫోన్‌ 5జీ ధర రూ.12వేలలోపే ఉండే అవకాశాలు అధికం. దీంతో ఒకానొక చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్‌గా ఈ మొబైల్‌ ఉండనుంది. ఈఎంఐ ఆప్షన్‌ను కూడా జియో ప్రకటించే అవకాశం ఉంది. 
 
బండిల్డ్ ప్లాన్స్, డేటా ఆఫర్లు కూడా ఉండొచ్చు. ఈ ఏడాది దీపావళి సేల్‌ సందర్భంగా జియోఫోన్ 5జీ మొబైల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. జియో కూడా ఈ ఏడాది చివరికల్లా చాలా ప్రాంతాలకు 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించాలని ప్లాన్ చేసుకున్నది.
 
జియో ఫోన్‌ 5జీ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ ఉంటుందని సమాచారం. 2జీబీ ర్యామ్+32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్+ 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. 5G ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్‌గా స్నాప్‌డ్రాగన్ 480 ఉంది. తక్కువ ధరలో 5జీ మొబైల్‌ను తెచ్చేందుకు జియో దీన్ని వినియోగిస్తోందని సమాచారం. 
 
ఈ ప్రాసెసర్‌ ఎనిమిది (ఆక్టా) కోర్స్‌ను కలిగి ఉంటుంది. జియోఫోన్ నెక్స్ట్‌లో ఉండే ప్రగతిఓఎస్ Jio Phone 5Gలో ఉండనుంది. రిలయన్స్ జియో కోసం గూగుల్ ఈ కస్టమ్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను రూపొందించింది.
webdunia
Jio
 
ఫీచర్స్   
6.5ఇంచుల హెచ్‌డీ+ IPS LCD డిస్‌ప్లే,
జియో ఫోన్‌ 5జీ వెనుక రెండు కెమెరాలు ఉంటాయి.
13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉండొచ్చు. 
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో రానుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీఎస్ లాసెట్ ఫలితాలు.. సాయంత్రం 4 గంటలకు విడుదల