Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

29న రియలన్స్ 45వ వార్షిక సర్వ సభ్య సమావేశం

mukesh ambani
, ఆదివారం, 28 ఆగస్టు 2022 (14:26 IST)
భారత పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం సోమవారం ముంబైలో జరుగనుంది. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ ఏజీఎస్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశానికి రిలయన్స్‌లోని వాటాదారులందరినీ పిలిచి ముంబై వేదికగా అట్టహాసంగా ఈ వేదికను నిర్వహిస్తారు. 
 
ఇందులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కంపెనీకి సంబంధించిన కొత్త వ్యూహాలు, పెట్టుబడులు, భాగస్వామ్యాలను ప్రకటిస్తారు. రిలయన్స్‌కు సంబంధించిన ఏ కీలక సమాచారాన్ని ఈ వేదికపై నుంచి ప్రకటిస్తారు. అలాగే, రిలయన్స్‌కు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయమైనా ఈ వేదిక నుంచే తీసుకుంటారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం జరుగనున్న రిలయన్స్ 45వ ఏజీఎంపై ప్రతి ఒక్కరి దృష్టి కేంద్రీకతృతమైంది. ప్రత్యేకించి ఏజీఎంలో ముఖేష్ అంబానీ ఎలాంటి వ్యూహాలు ప్రకటిస్తారన్న విషయంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చే సాగుతోంది. త్వరలోనే దేశ వ్యాప్తంగా 5జీ సేవలు ప్రారంభంకానున్నాయి. 
 
ఈ సేవలను వీలైనంత త్వరగా దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి దేశంలోని టెలికాం రంగంలో అగ్రగామిగా అయ్యేందుకు ఆయన ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే, 5జీ సేవలు, దానికి సంబంధించిన మొబైల్ ఫోన్లపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాప్‌కు తొలి కార్డినల్‌గా ఎన్నికైన తొలి తెలుగు బిషప్ పూల ఆంథోనీ