Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌లో అత్యంత విలాసమైన విల్లాను కొనుగోలు చేసిన ముఖేష్ అంబానీ

palm jumeirah
, ఆదివారం, 28 ఆగస్టు 2022 (09:36 IST)
ధనవంతుల భూతల స్వర్గంగా పేర్కొనే దుబాయ్‌లో భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ అత్యంత విలాసమైన విల్లాను కొనుగోలు చేశారు. ఈ దేశంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన పామ్ జమేరా దీవిలో ఆయన ఈ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. తన చిన్న కుమారుడు అనంత్ కోసం ఈ పామ్ జమేరా ఐలాండ్‌లో ఓ ఖరీదైన చిన్న విల్లాలను కొనుగోలు చేశారు. 
 
ఈ విల్లాకు ఇరుగుపొరుగువారు ఎవరో తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఈ అల్ట్రా లగ్జరీ భవింతికి ఓ వైపున బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ విల్లా, మరోవైపు, అంతర్జాతీయ ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్ హామ్ విల్లాలు ఉన్నాయి. ఈ బిల్లు ఖరీదు రూ.640 కోట్లు. 
 
ఇందులో పది పడక గదులు, ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూల్, మరో ఔట్‌‍డోర్ స్విమ్మింగ్ పూల్, ఒక పర్సనలో స్పాలు ఉన్నాయి. అదేసమయంలో ఈ విల్లాను తన కుమారుడు అనంత్ అభిరుచులకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు మరికొన్ని కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ కొనుగోలు చేయనున్నారని, ఈ విల్లా కొనుగోలులో కీలక పాత్ర పోషించిన ఓ రియల్టర్ కంపెనీ వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈటీ మనీ- ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ పర్సనాలిటీ రిపోర్ట్‌ 2022