మహిళను హత్య చేసి.. గోనె సంచిలో మూటగట్టి... రైల్వే స్టేషన్ వద్దపడేశారు...

ఠాగూర్
మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (19:39 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి ఒక గోనె సంచిలో మూట గట్టి.. ఆ మూటను చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రహరీ గోడ వద్ద పడేశారు. ఈ మూటను సోమవారం మధ్యాహ్నం 11.45 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు సీసీటీవీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు గుర్తించారు. 
 
బీహార్‌కు వెళ్లే రైలు కోసం సోమవారం భారీగా ప్రయాణికులు స్టేషన్ సమీపంలో వేచివున్నారు. అదేసమయంలో ఆటోలో అక్కడిక వచ్చిన వ్యక్తి మూటను వదిలి వెళ్లినట్టు గుర్తించారు. బీహార్‌కు వెళ్లే రైలు ఆలస్యంగా రావడంతో మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా ప్రయాణికులు అక్కడే ఉన్నారు. ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత అక్కడ మూట ఉండటాన్ని స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు గుర్తించి, పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
దీంతో పోలీసులు వచ్చి ఆ మూటను విప్పి చూడగా అందులో మహిళ మృతదేహం ఉండటంతో చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతురాలి వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై చర్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments