పరకామణి చోరీ కేసు : ఫిర్యాదు చేసిన ఏవీఎస్వో అనుమానాస్పద మృతి

ఠాగూర్
శుక్రవారం, 14 నవంబరు 2025 (13:33 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణికి సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తితిదే మాజీ ఏవీఎస్వో సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా కనిపించారు. పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచగా అప్పట్లో రాజకీయ నాయకులు, తితిదే ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీశ్‌ కుమార్‌ రాజీ చేసుకున్నారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసుపై సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో.. కేసు రాజీ చేసుకున్న సతీశ్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. సతీశ్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేసి రైలు పట్టాలపై పడేశారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments