Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురంలో చిచ్చుపెట్టిన మనస్పర్థలు... ప్రాణాలు తీసుకున్న దంపతులు

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (13:23 IST)
హాయిగా సాగిపోతున్న తమ కాపురంలో ఓ చిన్న సమస్య చిచ్చుపెట్టింది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. దీంతో ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మియాపూర్‌కు చెందిన జంగం సందీప్ (30)కు, మంచిర్యాలకు చెందిన కీర్తి(26)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అమీన్ పూర్ ఠాణాపరిధి బంధంకొమ్ములోని శ్రీధమ్ హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప పుట్టినరోజు విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. 
 
అదేసమయంలో బయటకు వెళ్లిన సందీప్ తిరిగి ఇంటికి వచ్చేసరికి కీర్తి ఇంటి పైకప్పు సీలింగ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సందీప్.. కీర్తిని కిందకు దించాడు. తన తండ్రికి ఫోన్ చేసి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ తర్వాత అదే సీలింగ్‌కు ఉరివేసుకొని సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో చిన్నారులు మియాపూర్‌లోని సందీప్ తండ్రి వద్ద ఉన్నారు. సోమవారం కీర్తి తండ్రి ప్రభాకర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments