Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపురంలో చిచ్చుపెట్టిన మనస్పర్థలు... ప్రాణాలు తీసుకున్న దంపతులు

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (13:23 IST)
హాయిగా సాగిపోతున్న తమ కాపురంలో ఓ చిన్న సమస్య చిచ్చుపెట్టింది. ఇది భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. దీంతో ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫలితంగా వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మియాపూర్‌కు చెందిన జంగం సందీప్ (30)కు, మంచిర్యాలకు చెందిన కీర్తి(26)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. అమీన్ పూర్ ఠాణాపరిధి బంధంకొమ్ములోని శ్రీధమ్ హిల్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప పుట్టినరోజు విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. 
 
అదేసమయంలో బయటకు వెళ్లిన సందీప్ తిరిగి ఇంటికి వచ్చేసరికి కీర్తి ఇంటి పైకప్పు సీలింగ్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సందీప్.. కీర్తిని కిందకు దించాడు. తన తండ్రికి ఫోన్ చేసి కీర్తి ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆ తర్వాత అదే సీలింగ్‌కు ఉరివేసుకొని సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో చిన్నారులు మియాపూర్‌లోని సందీప్ తండ్రి వద్ద ఉన్నారు. సోమవారం కీర్తి తండ్రి ప్రభాకర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments