Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎంలో డబ్బు తీసుకోవడం చేతకావడంలేదా... నేను తీసిస్తానంటాడు, అంతే కార్డు మారిపోతుంది

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (17:34 IST)
ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే భక్తులే అతని టార్గెట్. చదువుకున్న వారు ఎటిఎంలో డబ్బు తీసుకునే వారు అయితే పట్టించుకోడు. చదువుకోకుండా.. ఎటిఎంలో డబ్బులు తీసుకోవాలి అనుకుని అక్కడే తిరుగుతున్న వారే అతని టార్గెట్.

 
అలాంటి వారిని సులువుగా బురిడీ కొట్టిస్తాడు. వారి ఎటిఎం కార్డులను మార్చేస్తాడు. ఆ స్థానంలో డమ్మీ కార్డులు ఇస్తాడు. ఆ కార్డులన్నీ తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో డబ్బులను డ్రా చేస్తాడు. ఇలా లక్షల రూపాయలు డ్రా చేసుకుని జల్సా చేసి ఎంజాయ్ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 
తిరుపతి ఈస్ట్ పోలీస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బాలసముద్రం గ్రామానికి చెందిన క్రిష్ణమూర్తి గత ఐదు సంవత్సరాలుగా ఎటిఎంల దగ్గర తిరుగుతూ డబ్బులు తీసుకోలేని వారికి డబ్బులు డ్రా చేసి ఇచ్చేవాడు.

 
డబ్బులు డ్రా చేసిన తరువాత వారికి వేరే ఎటిఎం కార్డులను ఇచ్చేవాడు. వారి ఎటిఎం కార్డుతో పాటు ఆ పిన్ నెంబర్లను గుర్తు పెట్టుకుని కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి డబ్బులు డ్రా చేసేవాడు. ఇలా తిరుపతికి వచ్చి ఎంతోమంది భక్తుల ఎటిఎం కార్డులతో లక్షల రూపాయలను డ్రా చేశాడు.

 
నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు అతని నుంచి 2 లక్షల 80 వేల రూపాయలతో పాటు 20 ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కర్ణాటకలో మూడు కేసులు, తమిళనాడులో ఐదు కేసులు ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments