Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భర్తను కూలీగా చూడలేని వివాహిత పోలీసుతో వివాహేతర సంబంధం, చివరికి?

భర్తను కూలీగా చూడలేని వివాహిత పోలీసుతో వివాహేతర సంబంధం, చివరికి?
, శుక్రవారం, 26 నవంబరు 2021 (17:19 IST)
ఇద్దరు పిల్లలు. ప్రేమగా చూసుకునే భర్త. ఎలాంటి సమస్యలు లేని కుటుంబం. కానీ ఆ భార్యకు భర్త కూలి పనిచేస్తుండడం ఏ మాత్రం ఇష్టం లేదు. తన భర్త హుందాగా ఉద్యోగం చేసే వ్యక్తి అయి ఉండాలని భావించింది. అందుకే వేరే వ్యక్తిని ఎంచుకుంది. కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని చివరకు ప్రాణాలనే పొగొట్టుకుంది.

 
కర్ణాటక రాష్ట్రం శిడ్లఘట్ట ప్రాంతంలో రాజేశ్వరి, వెంకటేష్‌లు నివాసముంటున్నారు. వీరికి 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. వెంకటేష్ ముందు నుంచి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థికంగా అయితే ఎలాంటి ఇబ్బందులు లేవు.

 
కానీ రాజేశ్వరికి మాత్రం తన భర్త కూలి పనిచేయడం ఇష్టం లేదు. వ్యాపారం చేయమని ఎన్నోసార్లు ప్రాధేయపడింది. కూలి పని చేసినా మనకు డబ్బులు సరిపోతున్నాయని.. ఆర్థిక ఇబ్బందులు లేవు కదా.. కొత్తగా అప్పు చేసి ఎందుకు వ్యాపారం పెట్టడమని భర్త చెబుతూ వచ్చాడు. 

 
దీంతో భార్యకు కోపమొచ్చింది. ఇంటికి సమీపంలో అనంత్ కుమార్ అనే కానిస్టేబుల్ ఉండేవాడు. అతనికి వివాహం కాలేదు. అనంత్‌కు, రాజేశ్వరికి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న వివాహిత ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేది.

 
భర్తకు తెలిసింది. మందలించాడు. అయినా మారలేదు. అయితే భార్యాభర్తల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన భార్య చావుకు అనంత్ కుమార్ కారణమని ఫిర్యాదు చేశాడు భర్త. 

 
దీంతో అనంత్ కుమార్ పరారయ్యాడు. పరారీలో ఉన్న అనంత్‌ను పోలీసులు వెతుకుతున్నారు. పచ్చటి సంసారాన్ని అక్రమ సంబంధంతో రాజేశ్వరి నాశనం చేసుకోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీసీ కెమెరా: అడుగడుగున నిఘా, మానవ హక్కుల ఉల్లంఘనా? లేక భద్రత కోసం అనివార్యమా?