Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఠాగూర్
బుధవారం, 21 మే 2025 (10:37 IST)
ఓ మహిళతో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అనపర్తి మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మృతిచెందారు. పి.నాగిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం పెరిగి సహజీవనం సాగించారు. ఆ మహిళ కుమార్తెను వివాహం చేసుకుంటానని ఆమెను వేధిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మరో బాలికను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ జన్మించింది. తర్వాత భార్యా బిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి.. గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చి ఆమె కుమార్తెతో పెళ్లి జరిపించాలంటూ ఇరువురిని కొడుతూ వేధించేవాడు. దీంతో పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశానని.. స్టేషన్ వద్ద నాగిరెడ్డి తల్లి తన కుమార్తెపై దాడిచేసి తీవ్రంగా కొట్టిందని వాపోయారు. 
 
అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించానని ఆమె తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments