Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఠాగూర్
బుధవారం, 21 మే 2025 (10:37 IST)
ఓ మహిళతో సహజీవనం చేస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలంటూ వేధించసాగాడు. ఈ వేధింపులను భరించలేని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని అనపర్తి మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత భర్త 2016లో మృతిచెందారు. పి.నాగిరెడ్డి అనే వ్యక్తితో ఆమెకు పరిచయం పెరిగి సహజీవనం సాగించారు. ఆ మహిళ కుమార్తెను వివాహం చేసుకుంటానని ఆమెను వేధిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో మరో బాలికను వివాహం చేసుకోగా వారికి ఓ బిడ్డ జన్మించింది. తర్వాత భార్యా బిడ్డలను వదిలేసిన నాగిరెడ్డి.. గతంలో సహజీవనం చేసిన మహిళ వద్దకు మళ్లీ వచ్చి ఆమె కుమార్తెతో పెళ్లి జరిపించాలంటూ ఇరువురిని కొడుతూ వేధించేవాడు. దీంతో పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశానని.. స్టేషన్ వద్ద నాగిరెడ్డి తల్లి తన కుమార్తెపై దాడిచేసి తీవ్రంగా కొట్టిందని వాపోయారు. 
 
అపస్మారక స్థితిలో ఉన్న కుమార్తెను అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించానని ఆమె తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments