Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన భార్య మరొకరితో సహజీవనం చేస్తుందనీ...

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (08:54 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా వీరాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త కడతేర్చాడు. మరొకరితో సహజీవనం చేస్తుందని భావించిన ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదీకూడా మృతురాలు బతుకమ్మ ఆడుతున్న సమయంలోనే దారుణంగా హత్య చేశాడు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. 
 
పోలీసులు, బాధిత కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలుండగా పెద్ద కూతురు మంగను స్థానికుడైన యాళ్ల ఎల్లారెడ్డికి ఇచ్చి పెళ్లిచేశారు. నెల రోజులకే మంగ ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని చనిపోవడంతో మరలా రెండో కుమార్తె స్వప్నను ఇచ్చి వివాహం చేశారు. 
 
వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల వరకు వీరి కాపురం సజావుగా జరిగింది. తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు మొదలయ్యాయి. స్వప్న ఇదే గ్రామానికి చెందిన రమేశ్‌ అనే వ్యక్తితో 14 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. దీంతో ఎల్లారెడ్డి పలుమార్లు ఆమెతో గొడవకు దిగి చంపేస్తానని బెదిరించాడు.
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి మహిళలతో బతుకమ్మ ఆడుతుండగా.. ఆమె తలపై ఎల్లారెడ్డి ఇనుప రాడ్‌తో బలంగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్‌ఐ తిరుపతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రత్యేకమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు : ఉపాసన

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments