Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ సొంత జిల్లాలో విద్యార్థి అనుమానాస్పద మృతి

Webdunia
ఆదివారం, 2 జులై 2023 (09:42 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇది ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 
 
మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పులివెందుల అహోబిలాపురం వీధికి చెందిన నాగరాజు, లలిత దంపతుల కుమారుడు సోహిత్(11) ఖాజీపేట మండలం కొత్త పేటలోని బీరు శ్రీధర్రెడ్డి పాఠశాలలో 6వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. శనివారం ఉదయం పాఠశాల సిబ్బంది నాగరాజుకు ఫోన్‌చేసి సోహిత్ కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నాడని, దీంతో బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాలుడి శరీరంపై గాయాలు గుర్తించి మృతదేహాన్ని పాఠశాల వద్దకు తీసుకెళ్లగా, సిబ్బంది గేటు వేసేయడంతో బయటే బైఠాయించారు. 
 
సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదంటూ బంధువులు పాఠశాల కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించిన రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. ఎట్టకేలకు బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు బంధువులను ఒప్పించి కడప రిమ్స్‌కు తరలించారు. కాగా.. విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో బీరంరెడ్డి శ్రీధర్రెడ్డి పాఠశాలను తక్షణమే మూసివేయాలని డీఈవో రాఘవరెడ్డి ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments