Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ ఆర్డర్ బాక్సు తెరవగానే పేలిపోయింది, ఇద్దరు మృతి

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (16:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబర్‌కాంతలోని వడాలిలో ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఓ పార్శిల్‌ తెరవగానే పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. వడాలిలోని ఓ కుటుంబం ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ ఆర్డర్ చేసింది. పార్శిల్‌ను తెరవగానే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్శిల్ వంజర జితేంద్రభాయ్ పేరు మీద వచ్చింది. ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు పార్శిల్ తెరిచారు. ఆపై ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
ఒక రిక్షా పుల్లర్ వచ్చి ఇదిగో మీ పార్శిల్ ఎవరో నాకు ఇస్తే మీకు ఇస్తున్నానని చెప్పాడు. అనంతరం పార్శిల్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించింది. ఇందులో మంజూర్ హుస్సేన్ పిర్జాదా, 11 ఏళ్ల బాలిక చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పార్శిల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments