Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ ఆర్డర్ బాక్సు తెరవగానే పేలిపోయింది, ఇద్దరు మృతి

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (16:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబర్‌కాంతలోని వడాలిలో ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఓ పార్శిల్‌ తెరవగానే పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. వడాలిలోని ఓ కుటుంబం ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ ఆర్డర్ చేసింది. పార్శిల్‌ను తెరవగానే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్శిల్ వంజర జితేంద్రభాయ్ పేరు మీద వచ్చింది. ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు పార్శిల్ తెరిచారు. ఆపై ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
ఒక రిక్షా పుల్లర్ వచ్చి ఇదిగో మీ పార్శిల్ ఎవరో నాకు ఇస్తే మీకు ఇస్తున్నానని చెప్పాడు. అనంతరం పార్శిల్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించింది. ఇందులో మంజూర్ హుస్సేన్ పిర్జాదా, 11 ఏళ్ల బాలిక చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పార్శిల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments