ఆన్‌లైన్ ఆర్డర్ బాక్సు తెరవగానే పేలిపోయింది, ఇద్దరు మృతి

ఐవీఆర్
గురువారం, 2 మే 2024 (16:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబర్‌కాంతలోని వడాలిలో ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఓ పార్శిల్‌ తెరవగానే పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. వడాలిలోని ఓ కుటుంబం ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ ఆర్డర్ చేసింది. పార్శిల్‌ను తెరవగానే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్శిల్ వంజర జితేంద్రభాయ్ పేరు మీద వచ్చింది. ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు పార్శిల్ తెరిచారు. ఆపై ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
ఒక రిక్షా పుల్లర్ వచ్చి ఇదిగో మీ పార్శిల్ ఎవరో నాకు ఇస్తే మీకు ఇస్తున్నానని చెప్పాడు. అనంతరం పార్శిల్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించింది. ఇందులో మంజూర్ హుస్సేన్ పిర్జాదా, 11 ఏళ్ల బాలిక చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పార్శిల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments